మేడ్చల్, జూలై18(నమస్తే తెలంగాణ): ప్రకృతి ప్రేమికులకు కొండ గొర్రె అటవీ ప్రాంతం కేరాఫ్ అడ్రస్గా మారింది. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం లాల్గడి-మలక్పేట్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతం పర్యాటకులను ఆహ్లాదపరుస్తున్నది. లాల్గడి-మలక్పేట్లో 1045 హెక్టార్లలో దట్టమైన అడవి విస్తరించి ఉంది. హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఉండటమే కాకుండా కరీంనగర్కు వెళ్లే జాతీయ రహదారికి అనుకుని ఉంది.
లాల్గడి-మలక్పేట్ రిజర్వు ఫారెస్ట్లో అర్బన్ పార్కును అటవీ అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నది. హరిత సంపదకు నష్టం జరుగకుండా దట్టమైన పొదల నుంచి వాకింగ్ట్రాక్, సైకిల్పై ట్రెక్కింగ్కు కోసం ట్రాక్ ఏర్పాటు చేశారు. తాగునీటి సౌక ర్యం, బాత్రూమ్లు, కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. వారాంతంలో నగర వాసులు కొండ గొర్రె అటవీ ప్రాంతానికి వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తూ స్వచ్ఛమైన ఆక్సిజన్ను పొందుతున్నారు. లాల్గడి-మలక్పేట్ రిజర్వు ఫారెస్ట్ను మరింత గ్రీనరీ చేసేందుకు భారీ సంఖ్య లో మొక్కలు నాటి హరిత సంపదను పెంచనున్నారు.