కీసర, మే 4 : వ్యవసాయక్షేత్రంలో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందేలు నిర్వహిస్తున్న 10మంది ముఠాను అరెస్టు చేసిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం.. కీసర మండలం రాంపల్లిదాయర గ్రామ శివారులో ఓ ఫాంహౌస్ నిర్వాహకుడు బుచ్చిబాబు గుట్టు చప్పుడు కాకుండా కోడి పందేలు నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఫాంహౌస్పై దాడిచేసి బుచ్చిరెడ్డి, దమ్మాయిగూడకు చెందిన సుధాకర్, ఘట్కేసర్కు చెందిన వెంకటాద్రి, ఈడబ్ల్యూఎస్కాలనీకి చెందిన కాశయ్య, కుషాయిగూడకు చెందిన దుర్గాప్రసాద్, రాంపల్లిదాయరకు చెందిన రంగరాజు, కాప్రాకు చెందిన హన్మంత్, నాగారానికి బోడుగు యాకుబ్, ఘట్కేసర్కు చెందిన రాఘవ, కరీంగూడకు చెందిన సత్యనారాయణరాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్దనుంచి రూ.24,500 నగదు, నాలుగు పందెం కోళ్లు, 10 ద్విచక్ర వాహనాలు, పది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.