కీసర, ఆగస్టు :మండలంలోని వివిధ గ్రామాల్లోని దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల కేంద్రంలోని శివాజీనగర్ కాలనీ, గ్రంథాలయంకాలనీలతో పాటు అంకిరెడ్డిపల్లి గ్రామాల్లోని దళిత వాడల్లో మండల అధికారుల బృందం సోమవారం పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నది.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లోని దళిత వాడల్లో సీసీ రోడ్డులు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వంటి సమస్యలన్నింటిని పరిష్కారిస్తామన్నారు. ఆ బస్తీలో ప్రజలకు కావాల్సిన మౌళిక వసతి సదుపాయాల కోసం మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన దళితులందరినీ ఆదుకుంటుందన్నారు. ప్రతి దళితవాడను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీవో మంగతాయారు, కీసర, అంకిరెడ్డిపల్లి సర్పంచ్లు నాయకపు మాధురి వెంకటేశ్, మోర విమలనాగరాజు, మండల ఎఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఎఈ స్వామి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ కె.బాలమణి, పంచాయతీ సభ్యులు జూపల్లి లక్ష్మీ, రామారం ప్రదీప్కుమార్, బండారు శంకర్గౌడ్, మచ్చాని బొట్టు రమేశ్యాదవ్లతో పాటు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.