శామీర్పేట: నిరుద్యోగ యువతి, యువకులు ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో పద్మజారాణి అన్నారు. శామీర్పేట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిరుద్యోగ యువతకు అవగాహన సదస్సు నిర్వహించి ఉద్యోగ మేళా చేపట్టారు. ఈ మేరకు 148 మంది హాజరు కాగా వివిధ కంపెనీల ప్రతినిధులు 106 మందిని ఎంపిక చేసినట్లు డీఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వాణి గర్దాస్, ఎంపీటీసీ సాయిబాబా, యువతి యువకులు పాల్గొన్నారు.