కీసర, ఆగస్టు :డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నేడు మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ, యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మంగళవారం ఉదయం పది గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ యువతీ, యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, వారికి మూడు నెలల పాటు భోజన వసతితో పాటు, హస్టల్ వసతితో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
18 ఏండ్ల నుంచి 40 ఏండ్ల వయస్సు ఉన్న యువతీ, యువకులు పదో తరగతి పాస్, లేదా ఫెయిల్ ఐన వారితోపాటు డిగ్రీ వరకు చదివి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎలక్ట్రిషియన్, భూమి సర్వే, స్టోర్ కీపింగ్, ప్లంబింగ్ కోర్సులు, హోటల్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ గార్డ్స్, హౌస్ కీపింగ్, వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ పూర్తి అయిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతందని, ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.