మేడ్చల్ మల్కాజిగిరి : అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా మంటలు చెలరేగి వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గండిమైసమ్మలోని 60 గజాల కాలనీలో ఉంటున్న ఫిరోజ్ గత కొంతకాలంగా వంటగ్యాస్ల రీఫిల్లింగ్ చేస్తున్నాడు.
ఇదే క్రమంలో రీఫిల్లింగ్ చేస్తుండగా మంటలు చెలరేగి ఫిరోజ్గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న దుండిగల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఫిరోజ్ను చికిత్స నిమిత్తం దవాఖానకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.