కూకట్పల్లి, ఆగస్టు : శ్రావణమాసం శివ,పార్వతులకు ఎంతో ప్రీతికరమైన మాసం. కూకట్పల్లి పరిసర ప్రాంతాలలో అనేక శివాలయాలు ఉన్నప్పటికీ కూకట్పల్లిలోని పాత శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగ సిద్దేశ్వర ఆలయం, ఫతేనగర్లో ఉన్న శివాలయం, ఐడిపిఎల్ కంపనీ ప్రక్కన గల శివాలయం, బాలానగర్ కళ్యాణ్ నగర్లో గల భ్రమరాంభిక మల్లిఖార్జున ఆలయాలు విశిష్టమైనవి. ఇందులో అత్యంత పురాతన ఆలయం అయిన కూకట్పల్లిలో ఉన్నభ్రమరాంభికా మల్లిఖార్జున రామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తున్నది.
శ్రీ రామ లింగేశ్వర దేవాలయాలు మొత్తం 11 ఒకేసారి ఏర్పాటు చేశారు. అందులోనిదే పాత శివాలయం కైలాసయంత్ర ప్రస్థారికంలో స్వయంత్రముగాప్రతి విగ్రహానికి యంత్రము నిర్ణయించి పూజాది విశేషాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ దేవాలయం 2007లో పునర్ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయ ద్వజ స్తంభం అడుగు భాగంలో దీని చరిత్ర చక్కగా చెప్పడం జరిగింది. ఇది సుమారుగా కీసర గుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించిన కాలంలోనే కూకట్పల్లి మల్లిఖార్జున ఆలయం, పఠాన్ చెరువులోని రామలింగేశ్వర మల్లిఖార్జున ఆలయం ఒకే సమయమున ఒకే వైపు ముఖంతో, ఒకే రేఖపై ఏర్పాటు చేసిన ఆలయాలు అని స్థల పురాణం చెబుతుంది.
ఈ శివాలయం ప్రాంగణంలో ఉన్న మహానంది, మహాబలేశ్వరం నుంచి తీసుకుని ప్రతిష్ఠించారట. అంతే కాకుండా ఆలయ ప్రవేశ ద్వారంలో పంచాక్షరీ మహామంత్రం మహాన్యాస యంత్రంతో కూడిన ఐదు మెట్ల నిర్మాణం జరిగింది. ఆ ప్రవేశ ద్వారం ద్వారా ప్రవేశం చేసిన లేదా ద్వారా దృశ్యం చూసిన, ద్వారానికి నమస్కరించినా.. మహాన్యాస రుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుందని ప్రతీతి. ఈ రకమైన విశిష్టతలకు ఆలయ పూర్వ మాజీ చైర్మెన్ లోకై పటేల్ బాగా ఆలోచించి పండితుల అందరితో చర్చించి దీని పునర్నిణంలో విశేష కృషి చేశారు.