శామీర్పేట, జూలై 23 : ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో వెలసిన అక్రమ వెంచర్లను గుర్తించాలని అదనపపు కలెక్టర్ శ్యాంసన్ సూచించారు. మేడ్చల్ జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీఓలతో పాటు మున్సిపాలిటీ కమిషనర్లతో శామీర్పేట మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో అక్రమంగా వెలసిన అనుమతిలేని వెంచర్లను గుర్తించాలన్నారు. వెంచర్లలో ఎన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు ? మిగిలిన ప్లాట్లు ఎన్ని ? గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలకు ఎన్ని వెంచర్లను అప్పగించారనే అంశాలపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.