ఓడీసీఎంఎస్ చైర్మన్
గుగులోత్ రామస్వామినాయక్
ఖానాపురం/నెక్కొండ, మే 2: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. ఖానాపురం సొసైటీ ఆధ్వర్యంలో బుధరావుపేట, ధర్మరావుపేట, కొత్తూరు, మనుబోతులగడ్డ, అశోక్నగర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ధాన్యం విక్రయించిన మూడు రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, వైస్ ఎంపీపీ రామసాయం ఉమారాణి, వైస్ చైర్మన్ వేణుకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటనర్సయ్య, సర్పంచ్లు వెన్ను శ్రుతి, పూర్ణచందర్, కాస ప్రవీణ్, బూస రమ, వల్లెపు సోమయ్య, సొసైటీ డైరెక్టర్ మేకల కుమారస్వామి, గంగాధర రమేశ్, రవి, సొసైటీ సిబ్బంది రాజు, వినయ్ పాల్గొన్నారు. నెక్కొండ మండలం అలంకానిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రెడ్లవాడ సొసైటీ చైర్మన్ జలగం సంపత్రావు, సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మి-రవి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కర్పూరపు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటుక సోమయ్య, మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ సూరం రాజిరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ రోజనాల సంపత్, డైరెక్టర్లు కోరుకొండ యాకయ్య, మాదాసు సుధాకర్, రమేశ్, రత్నం, రైతుబంధు సమితి డైరెక్టర్ కోల సారంగం పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
సంగెం: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఎంపీపీ కందకట్ల కళావతి రైతులను కోరారు. కాపులకనపర్తి సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి ప్రారంభించారు. మండలంలోని 12 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ విశ్వనారాయణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కందకట్ల నరహరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, కాపులకనపర్తి ఎంపీటీసీ సుతారి బాలకృష్ణ, కిశోర్యాదవ్, గోవర్ధన్గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
భౌతికదూరం పాటించాలి
నర్సంపేట రూరల్: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు భౌతికదూరం పాటించాలని గురిజాల పీఏసీఎస్ చైర్మన్ ఆకుల రమేశ్గౌడ్ కోరారు. గురిజాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్తోపాటు ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ ప్రారంభించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ తోట శ్రీనివాస్, ఎంపీటీసీ బండారు శ్రీలత, సర్పంచ్లు గొడిశాల మమత, తుత్తూరు కోమల, గడ్డం సుజాత, కర్నాటి పార్వతమ్మ, తప్పెట రమేష్, ఉపాధ్యక్షుడు మేరుగు యాకయ్య, సీఈవో కోటి, డైరెక్టర్లు నామాల సోమయ్య, ఎడ్ల రవీందర్, యశోద సారంగపాణి, వెంకటేశ్వర్లు, కరుణాకర్, లక్ష్మి, మాజీ ఎంపీటీసీ గడ్డం కొమురయ్య, శ్రీనివాస్గౌడ్, గాదె సాంబయ్య, నీలం రామ్మోహన్, యశోద నర్సింగం, పీ రమేశ్, ప్రభుత్వ సహాయ న్యాయవాది మోటూరి రవి, అల్లి రవి పాల్గొన్నారు.
నేడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
చెన్నారావుపేట: మండలంలోని చెన్నారావుపేట పీఏసీఎస్ పరిధిలోని పాపయ్యపేట, రాగంపేటలో, అమీనాబాద్ పీఏసీఎస్ పరిధిలోని అమీనాబాద్, తిమ్మరాయిన్పహాడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రారంభిస్తారని సొసైటీల చైర్మన్లు ముద్దసాని సత్యనారాయణరెడ్డి, మురహరి రవి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో పాపయ్యపేట -2, కోనాపురంలో కొనుగోలు కేంద్రాలను ప్రాంభించనున్నట్లు ఏపీఎం ముక్కెర ఈశ్వరయ్య తెలిపారు.