మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
కూచన్పల్లి, సర్దన చెక్డ్యాంల వద్ద
గంగమ్మకు ప్రత్యేక పూజలు
హవేళిఘనపూర్, ఏప్రిల్ 23 : ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాకు గోదావరి జలాలను తీసుకొచ్చి మాట నిలబెట్టుకున్నారని, గోదావరి జలాలతో మెదక్ జిల్లా సస్యశ్యామలం కానున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేదర్రెడ్డి అన్నారు. హవేళిఘనపూర్ మండలలోని కూచన్పల్లిలో శుక్రవారం కరోనా వ్యాక్సిలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. కూచన్పల్లి, సర్దన చెక్డ్యాం వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూచన్పల్లి ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజారులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలనలో సింగూరులో నీరున్నా, నీటిని వదిలేందుకు రైతులు హైదరాబాద్కు వెళ్లి అర్జీలు పెట్టుకొని అడుక్కునే దయనీయ పరిస్థితుల్లో ఉండేవళ్లు అని అన్నారు. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల అవసరాలను ముందుగానే గుర్తించి, అడగక ముందే సింగూరు నుంచి విడుతల వారీగా నీటిని వదిలి రైతుల సాగునీటి కష్టాలు తీర్చారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములను త్యాగం చేసిన రైతులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కాళేశ్వరం నీరు రాని హవేళిఘనపూర్ మండలంలోని రైతులకు రాయిన్పల్లి జోగయ్య ఒర్రె ద్వారా నీటిని అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సర్దన చెక్డ్యాం పనులు వేగవంతం చేసి జూలై లోపు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆమె ఆదేశించారు. చెక్డ్యాంకు వెళ్లేందుకు అదనంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని రైతులు కోరగా, అందుకు ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆమె ఆదేశించారు. కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి మాణిక్యరెడ్డి, వైస్ ఎంపీపీ రాధాకిషన్యాదవ్, మండల వైద్యాధికారి చంద్రశేఖర్రావు, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఖాలేద్, సర్పంచ్ దేవాగౌడ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొంపల్లి సుభాశ్రెడ్డి, సతీశ్రావు, రాగి అశోక్, మండల అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, అంజాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్రావు, కూచన్పల్లి మాజీ ఎంపీటీసీ కిష్టాగౌడ్, గోపాల్గౌడ్, కిష్టాగౌడ్, బ్రహ్మం, రాజు, మేకల సాయిలు, రాంచంద్రారెడ్డి, టీఆర్ఎస్వీ నాయకులు నవీన్ పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ ప్రారంభం..
మండల కేంద్రమైన హవేళిఘనపూర్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ను శుక్రవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. వృథాగా పడేసే ప్లాస్టిక్తో ఆదాయం సమకూరే ఈ పరిశ్రమ ద్వారా ఎంతో లాభం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సవిత, మాజీ సర్పంచ్ సాయిలు, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్, పాల్గొన్నారు.