సికింద్రాబాద్, అక్టోబర్ 17: టైప్ ఇన్స్టిట్యూట్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ (టీఆర్టీఎస్)సమావేశం బోయిన్పల్లిలోని మర్రి రాజశేఖర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగింది.
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం దృష్టికి చిన్న చిన్న సమస్యలు తీసుకెళ్లకుండా పరిష్కారానికి అనుకులమైన వాటిని తీసుకెళ్తే భవిష్యత్తులో మనకు ఎలాంటి అవసరాలు ఉన్నా ప్రభుత్వం మనకు అండగా ఉంటుందన్నారు. టైప్ రైటింగ్ ఎక్సమ్ ఫీజ్ను తగ్గించేందుకు, టెస్టు గుర్తింపు పొందిన టైప్ ఇనిస్టిట్యూట్ల వారికే ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఆదే విధంగా టైప్ రైటింగ్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరకు తీసుకెళ్లి మన సమస్యలను పూర్తిస్థాయిలో వివరిస్తే సమస్యల పరిష్కారానికి మార్గం సుగుమం అవుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్టీఎస్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ప్రదాన కార్యదర్శి బి.సతీష్బాబు, రాజేశ్వర్, మల్లిఖార్జున్, రామేశ్వర్చారి, సీతారాం, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.