కీసర, ఏప్రిల్ 26 : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్న మాటలను నిజం చేస్తూ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం అధికారాలను కట్టబెట్టింది. గ్రామాల్లో చేపట్టే ప్రతి అభివృద్ధి పనులను స్థానికంగా ఉన్న పంచాయతీ ఆధ్వర్యంలోనే చేపట్టే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. పంచాయతీ ద్వారా అభివృద్ధి జరుగడానికి ప్రభు త్వం కొత్త జీవో 18ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ జీవో ద్వారా గ్రామాల్లో ఎన్ని లక్షల పనులకైనా పంచాయతీలో సభ్యుల తీర్మానం చేసుకోవడానికి చక్కటి అవకాశాన్ని కల్పిస్తూ ఈ జీవోను జారీ చేసింది. గతంలో గ్రా మాల్లో కొత్త పనులను ప్రారంభించడానికి ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసేవారు. దీంతో గ్రామాల్లో చేప ట్టే పనుల్లో తీవ్ర జాప్యం జరిగేది. ప్రభుత్వం గ్రామాల్లో జరుగుతున్న ఇబ్బందులు, పనుల్లో జాప్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొన్న ప్రభుత్వం నేరుగా పంచాయతీల ద్వారానే పనులు చేసుకొవడానికి కొత్త అధికారాలను ఇవ్వాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టింది. పాత విధానానికి స్వస్తి పలుకుతూ స్థానిక సంస్థలకు సరియైన న్యాయం చేకురుతుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 18 తో పాలకవర్గం తీర్మానం చేసుకొంటే ఎన్ని లక్షల నిధులైనా వెచ్చించి అభివృద్ధి చేసుకోవడానికి వెసులుబాటును కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామాలకు అత్యధిక నిధులను విడుదల చేస్తున్నది.
గతంలో గ్రామాల్లో కేవలం రూ. 2 లక్ష ల వరకే తీర్మానం చేసి, పనులు చేసుకునే అవకాశం ఉండేది.
రూ. 3లక్షలైతే డీఎల్పీఓ, రూ. 10లక్షల వరకు అయితే కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది.
పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చిన తరువాత రూ. 20లక్షల నుంచి ఇంకా ఎన్ని లక్షలైనా పంచాయతీ సభ్యు ల సమక్షంలో తీర్మానం చేసుకొని పనులను ప్రారంభించే వెసులుబాటును కల్పించడంతో గ్రామల సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ప్రభుత్వం నుంచి వివిధ శాఖల ద్వారా కూడా ఈ పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామాల అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరవుతాయి.
పంచాయతీల అభివృద్ధికి గా ను తెలంగాణ ప్రభుత్వం పం చాయతీరాజ్ చట్టంను అమలులోకి తీసుకొచ్చి 18వ జీవోను అమలు చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో గ్రామాల్లో ఏ పని చేయాలన్న మండల అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రభు త్వం జారీ చేసిన జీవోతో పంచాయతీరాజ్ చట్టం ద్వా రానే ఎన్ని పనులైనా చేసుకోవడానికి అధికారం రావ డం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – నాయకపు మాధురి వెంకటేశ్ కీసర సర్పంచ్
పంచాయతీరాజ్ జీవో 18 తో గ్రామాలు అభివృద్ధిలో మరింతగా ముందుకెళ్తాయి. ఎన్ని నిధులు వెచ్చించాలన్న అధికారం పంచాయతీ పాలక వర్గానికే కేటాయించడంతో పాటు నిధులను సొంతంగా ఖర్చు చేసుకోవడానికి పంచాయతీలకు అధికారాలను ఇవ్వడం మంచి ఉద్దేశం. ఈ జీవోతో గ్రామాల్లో అత్యధిక పనులను చేసుకోవడానికి ఆస్కారం రావడం చాలా ఆనందంగా ఉంది. ఆకిటి మహేందర్రెడ్డి, గోధుమకుంట సర్పంచ్