అమరావతి : ఆక్సిజన్ కొరత కారణంగా కొవిడ్ బారినపడిన చాలామంది అత్యవసర సమయంలో ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఇదే తరహా ఘటన జరిగింది.
కొవిడ్ బారినపడి స్థానిక క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు కరోనా రోగులు మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆక్సిజన్ కొరత కారణంగానే చనిపోయినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చంద్రుడు హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి సైతం దవాఖాన వద్దకు చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ఇటీవల కర్నూల్, విజయనగరం జిల్లాల్లోనూ ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస ఘటన జరుగుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.