నిజామాబాద్ : కరోనా పరీక్షల కోసం దవాఖానకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘట జిల్లాలోని రెంజల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బొర్గం గ్రామానికి చెందిన అశోక్ (30) అనే వ్యక్తి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో భార్య లక్ష్మి, తల్లి గంగమని, తమ్ముడు గంగాధర్ తో కలసి సొంత ఆటోలో రెంజల్ పీహెచ్సీలో కరోనా టెస్టులు చేసుకున్నాడు. కరోనా నెగిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయిన కొద్ది సేపటికి చెట్టు కింద కూర్చున్న చోటే మృతి చెందాడు. మృతి దేహాన్ని బొర్గం గ్రామంలో ట్రాక్టర్ సహాయంతో కోవిడ్ నిబంధన మేరకు అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు