మేడ్చల్ మల్కాజిగిరి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు వి హబ్ను నెలకొల్పిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్నగర్ డివిజన్ పరిధి కృష్ణమూర్తినగర్ కాలనీలో వి హబ్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీ నేషనల్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎంబ్రాయిడరీ స్టూడియోను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 600 మంది కొత్త కొత్త బిజినెస్ ఐడియాలతో వి హబ్లో ప్రజెంటేషన్ ఇవ్వగా గుమ్మడి భవ్య ఐడియాలజిని విహబ్ గుర్తించి ఎస్బిఐ బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేసిందన్నారు. ఈ స్టూడియో ద్వారా ఎంబ్రాయిడరీ రంగంలో ఆసక్తి ఉన్న 100 మంది మహిళలకు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ అపరేటింగ్ను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.
మహిళలు పట్టుదలతో ముందుకు వస్తే సాధించలేనిది అంటూ ఏది లేదన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేయడమే వి హబ్ లక్ష్యమన్నారు.
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుడిమెట్ల హేమలత, ఫోగ్రాం కో అర్డినేటర్లు అన్నపూర్ణ, తరుణ్, నవీన్కుమార్తదితరులు పాల్గొన్నారు.