జీడిమెట్ల, డిసెంబర్ 19 : గ్యార్వీ ఉత్సవాలు హిందు, ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం గాజులరామారం చింతల్ డివిజన్ పరిధి వివేకానందనగర్లో మహబూబ్ సుభాని దర్గా వద్ద నిర్వహించిన గ్యార్వీ ఉత్సవాలలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..మత సామరస్యానికి ప్రతీకగా గ్యార్వీ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి పెట్టింది పేరన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహ్మద్ అలీ, చాంద్పాషా, మహబూబ్, మూసా, ఆసీఫ్, నబీ, ముస్తాఫా, నరేష్, భిక్షపతి, శేఖర్రావు, ప్రభాకర్గుప్తా, వహీద్ ఖురేషీ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.