మేడ్చల్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్ప ల్ నియోజక వర్గాలలోని 17 చెరువులలో నిమజ్జనాలు జరుగుతున్నాయి. నిమజ్జనాలు సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగనున్నాయి. నిమజ్జనాలు సజావుగా సాగేందుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్.హరీశ్ 17 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రత్యేక అధికారులు వినాయక నిమజ్జనాలను ప్రత్యేక్షంగా పర్యవేక్షిస్తూ విజయవంతంగా నిమజ్జనాలు జరిగేలా చూస్తున్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. చెరువుల వద్ద జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లాలోని వివిధ చెరువుల వద్ద జరిగే నిమజ్జనాలను జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి పరిశీలించారు. జిల్లా లో 2619 విగ్రహాలను ప్రతిష్టించగా ఆదివారం సాయం త్రం వరకు 2085 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి.