కీసర, ఆగస్టు : గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని చీర్యాల్లోని ఐజీ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు.
విషయం తెలుసుకున్న కీసర పోలీసులు శుక్రవారం పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి రెడ్ హ్యండెడ్గా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లికి చెందిన నవీన్ (32), నాగారంలోని గాంధీనగర్కు చెందిన దొడ్డి కృష్ణామూర్తి (47),కీసరకు చెందిన ఉమ్మెట (28), ఈస్టు గాంధీనగర్కు చెందినవారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు, రూ.27,750 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.