దుబాయ్: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్లో ఇండియన్ పేసర్ శిఖా పాండే టాప్-10లోకి దూసుకొచ్చింది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో 610 రేటింగ్ పాయింట్లతో భారత అమ్మాయి బౌలర్ల జాబితాలో పదో స్థానంలో నిలిచింది. సీనియర్ పేసర్ జులన్ గోస్వామి ఐదో ర్యాంకులో కొనసాగుతుండగా, పూనమ్ యాదవ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
బ్యాటర్ల ర్యాంకింగ్స్లో భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్, స్టార్ బ్యాట్స్వుమన్ స్మృతి మందాన వరుసగా ఏడు, ఎనిమిది స్థానాలను నిలుపుకున్నారు. ఆల్రౌండర్ల జాబితాలో టీమ్ఇండియా నుంచి దీప్తి శర్మ ఐదో ర్యాంకులో కొనసాగుతోంది. ఈ లిస్టులో అమ్మాయి ఒక్కదానికే చోటు దక్కింది.