హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని ఓ ఎలక్ట్రిక్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. జీడిమెట్ల సుభాష్ నగర్లోని ఓం చంద్రా అనే ఎలక్ట్రిక్, ఫ్యాన్ వైండింగ్ కంపెనీలో కండెన్సర్లకు వార్నిష్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు మంటలు అంటున్నాయి. క్షణాల్లో మంటలు పరిశ్రమ నలుమూలలా వ్యాపించాయి. ప్రమాదంలో ఐదుగురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానలకు తరలించారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.