కాప్రా : ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి కాప్రా ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. కాప్రాడివిజన్ ఎల్లారెడ్డిగూడలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆయన తల్లిదండ్రులు, సతీమణికి కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కడియాల రమేష్, ప్రధాన కార్యదర్శి శనిగరం అశోక్, వర్కింగ్కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి గోపాల్గౌడ్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు మోతె వెంకట్రెడ్డి, మెరుగు చంద్రమోహన్, యవాపురం రవి, నర్సింగ్గౌడ్, రమేష్, ఆంజనేయులు, రమేష్యాదవ్, దొమ్మాటి కిరణ్కుమార్రావు, రామచంద్రమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.