కీసర, ఆగస్టు : కీసర మండలం చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా మొదటి రోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి గర్భగుడిలో శ్రావణమాసం సందర్భంగా వేదపండితులు స్వర్ణపుష్పాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ పండితులు, ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణలు ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా ఆహ్వానించారు. స్వామివారికి స్వర్ణపుష్పాలతో ఆయన ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణమందిరంలో ఆలయ చైర్మన్ ఆయనను శాలువతో సత్కారించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం వేదపండితుల బాబుమోహన్ ను ఆశీర్వదించారు.