కుత్బుల్లాపూర్,అక్టోబర్10 : నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రతి ఒక్కరు బాధ్యతతో చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి గణేష్నగర్లో హరితహరం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంతో ప్రజల్లో ఒక సామాజిక బాధ్యతను పెంచిందన్నారు. భవిష్యత్ తరాల మనుగడకు చెట్లు ఎంతో అవసరమన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రజలంతా చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీశ్, బొడ్డు వెంకటేశ్వర్రావు, సత్తిరెడ్డి, నర్సింహారెడ్డి, వనం శ్రీనివాస్, యాదగిరి, భాస్కర్గౌడ్, మురళీగౌడ్, దుర్గారావు, లింగం యాదవ్, నర్సింగరావు, కృష్ణ, రాజిరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.