చర్లపల్లి : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్దికి నిధులు కేటాయించి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తెలిపారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ద్వారకపురి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకొవాలని కొరుతూ బుధవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు డివిజన్లలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, ద్వారకపురి కాలనీలో డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
డివిజన్లో విద్యుత్ సమస్యలు తలేత్తకుండా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, కాలనీలలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టడంతో పాటు వీధిదీపాల నిర్వహణ మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం నాయకులు గురుమంచి ఆశోక్చారి, దామరపల్లి నర్సింహ్మరెడ్డి, గొల్ల సీత మహలక్ష్మి, రాజేశ్, అందజేయులు, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.