చర్లపల్లి, ఆగస్టు : చర్లపల్లి డివిజన్ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్లో శనివారం ఆమె ఏఈ సత్యలక్ష్మితో కలిసి పర్యటించి నాలా , డ్రైనేజీ సమస్యలను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదర్శనగర్లో నూతన బాక్స్ డ్రైయిన్ నిర్మాణం పనులు చేపట్టేందుకు నిధులు మంజూరైయ్యాయని, త్వరలో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీలో డ్రైనేజీ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకొవడంతో పాటు నాలాలో పేరుకుపొయిన వ్యర్ధాలు, చెత్త తొలగింపు పనులు చేపడుతున్నామన్నారు.