కార్పొరేట్కు దీటుగా నడుస్తున్న శేరిలింగంపల్లి మండల మైనార్టీ గురుకుల ఆంగ్ల మాద్యమ పాఠశాలలో నూతన విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ ప్రారంంభమైంది. ఈ మేరకు ప్రవేశాల షెడ్యూల్ను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడి పాఠశాలలో శుక్రవారం విడుదల చేశారు. 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఆంగ్ల మాద్యమంలో ఆయా తరగతులకు ప్రవేశాలను ఆహ్వానిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల నిర్వాహకులు కోరారు. ఐదేండ్ల క్రితం ప్రారంభమైన శేరిలింగంపల్లి మండల మైనార్టీ గురుకుల పాఠశాల హైదర్గనర్లోని ఓ భవనంలో కొనసాగుతున్నది. విద్యార్థుల ఆదరణను పొందుతూ ఏడాదికేడాది మైనార్టీ గురుకుల పాఠశాల ఉత్తమ ఫలితాలతో ముందుకు సాగుతున్నది. ఉచిత విద్య, హాస్టల్ వసతి, నాణ్యమైన చదువు, కార్పొరేట్ తరహా హంగులతో కొనసాగుతున్న ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం విద్యార్థులు పోటీ పడుతుండటం మైనార్టీ గురుకుల పాఠశాల సత్తాను నిరూపిస్తున్నది.
హైదర్నగర్లో కొనసాగుతున్న శేరిలింగంపల్లి మండల మైనార్టీ గురుకుల పాఠశాలలో నూతన విద్యాసంవత్సరపు ప్రవేశాల నిమిత్తం ప్రకటనను శనివారం విడుదల చేశారు. పాఠశాలలో 5, 6వ తరగతితో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 5వ తరగతిలో 70 సీట్లకు గాను 60 సీట్లు మైనార్టీ విద్యార్థులకు మిగిలిన 10 నాన్ మైనార్టీ విద్యార్థులకు కేటాయించారు. 6వ తరగతిలో 20 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 40 సీట్లకు గాను 30 మైనార్టీ, మిగిలిన 10 సీట్లు నాన్ మైనార్టీలకు, బైపీసీ గ్రూపులో 40 సీట్లకు గాను 30 మైనార్టీ, మిగిలిన 10 నాన్ మైనార్టీ విద్యార్థులకు రిజర్వ్ చేశారు. 6వ తరగతిలో బ్యాక్లాగ్ సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆయా తరగతులకు సంబంధించి ప్రవేశాల నిమిత్తం దరఖాస్తు చేసుకునేందుకు గడువును విధించారు.
www.tmreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఆసక్తి గల వారు పాఠశాలను సంప్రదించి దరఖాస్తులను పొందే వెసులుబాటును కల్పించారు.
ప్రభుత్వం అన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తున్న మైనార్టీ గురుకుల పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
నాణ్యమైన విద్యకు, అత్యద్భుతమైన వసతులకు కేరాఫ్ తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలు. శేరిలింగంపల్లి మండల మైనార్టీ గురుకుల పాఠశాలలో 2021-22 విద్యాసంవత్సరానికి గాను 5, 6 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువు ఉన్నది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. కార్పొరేట్కు దీటుగా మైనార్టీ గురుకుల పాఠశాల కొనసాగుతున్నది. ప్రతి ఏడాది ఉత్తమ ఫలితాలతో పాటు క్రీడలలోనూ మా విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారు. – చందర్రెడ్డి, ప్రిన్సిపాల్ మైనార్టీ గురుకుల