అల్లాపూర్ :మోతీనగర్ ఎక్స్టెన్షన్ లో శివరామాంజనేయ దేవాలయం పునర్నిర్మాణానికి దాతలు పుచ్చా శ్రీరామ్మూర్తి కుంటుంబ సభ్యులు రూ.20 లక్షలు విరాళంగా అందించిన్నట్లు ఆలయ కమిటి సభ్యుడు రమేష్ అయ్యంగార్ తెలిపారు. స్థానికంగా నివాసముంటున్న పుచ్చా శ్రీరామ్మూర్తి 50ఏండ్లు గా ప్రతీఏటా శ్రీసీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు.
కోరిన కోరికలు తీర్చే తమ ఇష్టదైవానికి శ్రీరామ్మూర్తి కుంటుంబసభ్యులు ఆలయ నిర్మాణం కోసం రూ. 20 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ..సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.