మల్లాపూర్: గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ పరిధి కైలాసగిరి బస్తీలోని ఇండ్లపై ఎన్ఎఫ్సీ ప్రహరిగోడ కూలిపోవడంతో బాధితులకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాలనీ అధ్యక్షుడు జంగ బాల్రాజ్ మంగళవారం బాధితులకు 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల్నర్సింహ, జీఎస్. రామక్రిష్ణ, జయరాజ్, జోగు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.