కేపీహెచ్బీ కాలనీ: ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకుని కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణ పొందాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. గురువారం మూసాపేట సర్కిల్లోని అవంతినగర్, రాజీవ్గాంధీనగర్, కేపీహెచ్బీ కాలనీలలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో ప్రతిరోజూ రెండు ప్రాంతాల్లో మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్, మరో రెండు కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా వేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి, రెండు డోస్ టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ మురళీధర్రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.