కీసర/మేడ్చల్ మల్కాజిగిరి : హరితహారంలో నాటిన చెట్లను నరికితే ఉపేక్షించేది లేదని గోధుమకుంట సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి హెచ్చరించారు. మండల పరిధి గోధుమకుంటలోని వీఎస్ఆర్ నగర్ కాలనీలో హరితహారం కింద నాటిన మొక్కలను ఆ కాలనీకి చెందిన జె. శ్రీనివాస్గౌడ్ నరికాడు.
విషయం తెలుసుకున్న సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి వెంటనే అతనికి రూ.20వేల రూపాయల జరిమానా విధించారు. ఎవరైనా హరితహారం చెట్లను నరికతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.