కరోనా రోజురోజుకు పెరుగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. సెకండ్ వేవ్ కరోనా తొందరగా విస్తరిస్తుండడంతో ప్రజల్లో వణుకుపుడుతోంది. కీసర మండలంలోని అర్భన్, రూరల్ ప్రాంతాలకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టులు, వ్యాక్సిన్ను వేస్తున్నారు. కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రతినిత్యం కరోనా పెషేంట్లతో కిక్కిరిసి పోతుంది. మండలానికి ప్రధాన దవాఖాన కావడంతో మున్సిపాల్టీల నుంచే కాక మండలంలోని 10పంచాయతీలకు చెందిన ప్రజలు ఇక్కడకు వచ్చి కరోనా టెస్టులు, వ్యాక్సిన్లను వేయించుకుంటున్నారు. దవాఖానలో సరైన సదుపాయలు లేక ఇక్కడికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా ఇక్కడ తాగడానికి నీరు లేక చాల మంది పెషేంట్లు, టెస్టుల కోసం వచ్చే వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి దవాఖానలో తాగునీటి సమస్యను పరిష్కారించాలని కోరుతున్నారు. కరోనా వచ్చిన చాలా మంది హోం ఐసొలేషన్లో ఉంటూ వైద్యుల సలహాలతో చికిత్స తీసుకుంటున్నారు. ప్రతి రోజు 450 నుంచి 500వరకు కరోనా టీకా లు వేస్తున్నారు. కోవిషీల్డు వ్యాక్సిన్ను ఇప్పటికీ 4814 మందికి, కోవాగ్జిన్ 797మందికి వేశారు. ఇక కరోనా ర్యా పిడ్ టెస్టులు మొత్తం 12, 789 మందికి చేయగా వాటిలో 1586మందికి పాజిటివ్ వచ్చింది. సెకండ్వేవ్లో కరోనా టెస్టులో 2098మందికి చేయగా వాటిలో 442మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.