కీసర, ఏప్రిల్ 11 : మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సభ్యులతో పాటు పలు పార్టీల నేతలందరూ కరోనా టీకా వేసుకొని కరోనాను తరిమికొట్టాలని కీసర ఎంపీడీవో పద్మావతి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కరోనాపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కరోనా టీకా రెండుసార్లు వేసుకుంటే మనిషి శరీరంలో బలమైన శక్తి ఏర్పడుతుందన్నారు. ప్రజలు అత్యవసర సమయాల్లో తప్పా ఇంట్లో నుంచి బయటికి రావొద్దన్నారు. తప్పని సరిగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు.
ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని ఎస్సై రమేశ్ అన్నారు. ఆదివారం సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో నాగారంలో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంపల్లి చౌరస్తా వద్ద మాస్కు ధరించని వారికి కరోనాపై అవగాహన కల్పించి మాస్కులను అందజేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్కులు లేకుండా ఇండ్ల నుంచి బయటికి రావొద్దన్నారు. మాస్కు ధరించని వారికి రూ.1000 ఫైన్తో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సభ్యులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.