కాప్రా : ఆపద సమయంలో ముఖ్యమంత్రిసహాయనిధి నుంచి మంజూరయ్యే ఆర్థికసహాయం లబ్దిదారులకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం మీర్పేట్హెచ్బికాలనీ డివిజన్కు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, భాగ్యమ్మ, శోభతో పాటు గరిక సుధాకర్, ముత్యంరెడ్డి, ముస్తాక్ గిరిబాబు పాల్గొన్నారు.