దుబాయ్: శ్రీలంక మాజీ పేసర్ నువాన్ జోయ్సాపై ఐసీసీ ఆరేండ్ల నిషేధం విధించింది. మ్యాచ్కు ఫిక్సింగ్కు ప్రయత్నించడంతో పాటు బుకీతో అవినీతి సంప్రదింపులపై ఫిర్యాదు చేయని కారణంగా అతడిపై వేటు వేసింది. జాతీయ కోచ్గా ఆటగాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన జోయ్సా అవినీతికి పాల్పడ్డాడని, అందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు ఐసీసీ ఇంటెగ్రిటీ జీఎం అలెక్స్ మార్షల్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. శ్రీలంక తరఫున 30 టెస్టులు, 95 వన్డేలు ఆడిన నువాన్.. కోచ్గా ఉన్నప్పుడు ఫిక్సింగ్కు ప్రయత్నించినట్టు ఆరోపణలు రావడంతో 2018 అక్టోబర్లోనే అతడిపై ఐసీసీ ప్రాథమిక నిషేధం విధించింది.