శామీర్పేట, ఏప్రిల్ 30 : తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అండగా నిలుస్తున్నాడని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి అన్నారు. మూడుచింతల్పల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు మంద స్వామిముదిరాజ్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని పార్టీ ఇన్చార్జి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీఠ వేస్తూనే ప్రజా సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నాడని తెలిపారు. గ్రామాల్లో పేద, నిరుపేద ప్రజలు మృత్యువాత పడితే వారి కుటుంబానికి రూ. 5వేలు ఆర్థిక సహా యం అందజేస్తున్నట్లు వివరించారు. కరోనా సమయంలోనూ ప్రజల బాగోగులు తెలుసుకుం టూ ఆపత్కాలంలో మంత్రి అండగా నిలుస్తున్నాడని అన్నారు. కార్యక్రమం లో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, మద్దుల శ్రీనివాస్రెడ్డి, మురళీగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి చిత్తాగౌడ్, రైతుబం ధు కన్వీనర్లు శ్యామల, కంటం కృష్ణారెడ్డి, సర్పంచ్లు సింగంఆంజనేయులు, జామ్ రవి, సీహెచ్. విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు విష్ణుగౌడ్,బాబుచారి, మురళీగౌడ్, అఫ్జల్ఖాన్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.