కేపీహెచ్బీ కాలనీ: నైజాం పాలకులకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తి దాయకమని గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్ అన్నారు. శనివారం కేపీహెచ్బీ కాలనీలో చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నైజాం నిరంకుశ పాలనను ఎదురించి పోరాడిన వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏడుకొండలు, వెంకటేశ్వర్రావు, సీతమ్మ, బాలు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.