చర్లపల్లి : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్పూర్తి అయిన చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రజక సమితి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈసీఐఎల్ చౌరస్తాలోని ఆమె విగ్రహనికి కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి, ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు పావనీమణిపాల్రెడ్డి, కొత్త రామారావులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మను యువత ఆదర్శంగా తీసుకొవాలని, చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలు అర్పించిన అనంతరం ఆమె సేవలను కొనియాడారు.
అనంతరం టీఆర్ఎస్ నాయకులు కాసం మహిపాల్రెడ్డి, మణిపాల్రెడ్డి, బేతాల బాల్రాజు, నాగిళ్ల బాల్రెడ్డి, డప్పు గిరిబాబు, పాండాల శివకుమార్గౌడ్, రెడ్డినాయక్, రేగిళ్ల సతీష్రెడ్డి, గరిక సుధాకర్, కందాడి సుదర్శన్రెడ్డి, కొత్త అంజిరెడ్డి, మహ్మద్బాజీబాషా, లక్ష్మినారాయణ, తెలంగాణ రజక సమితి రాష్ట్ర అధ్యక్షుడు పెద్దపురం కుమార్స్వామి, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శనిగరం ఆశోక్, ప్రతినిధులు ముంజంపల్లి రాములు, వెంకటేశ్, కరునాకర్, రవి, శేఖర్, బాలయ్య తదితరులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అదేవిధంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీఎస్.బోస్, టీడీపీ నాయకులు టీజీకే.మూర్తి, నాయకులు సాంబమూర్తిగౌడ్, నిర్మల, సతీష్బాబు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శంకర్రావు, సీపీఐ కార్యదర్శి లక్ష్మినారాయణ తదితరులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.