దుండిగల్, అక్టోబర్ 17: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతినగర్ ఎలీప్లోని సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్(సీఈడీ) ఆధ్వర్యంలో వ్యాపార రంగంలో రాణించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆన్లైన్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు సంస్థ సెక్రెటరీ త్రిపురాంబ తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణ శిబిరంలో భాగంగా వ్యాపార రంగం నిర్వహణ, మార్కెట్లో వివిధ ఉత్పత్తులకు ఉన్న అవకాశాలు, డిమాండ్పై రెండు వారాల పాటు అవగాహన కల్పిస్తామని తెలిపారు. అదే విధంగా ఆత్మ నిర్భర్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలకు కల్పిస్తున్న రాయితీలు, పరిశ్రమలను నెలకొల్పే విధానం, ఎంఎస్ఎఈ, ఎన్ఎస్ఐసీ వంటి వాటిపైన శిక్షణ ఇస్తామన్నారు. ఉభయ తెలుగు రాష్ర్టాలలోని ఆసక్తి కలిగిన ఔత్సాహికులు, పారిశ్రామిక వేత్తలు +91 70366 66423, 94906 84344 నెంబర్లల్లో సంప్రదించాలని సూచించారు.