పీర్జాదిగూడ, ఏప్రిల్4: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయని మల్కాజిగిరి జోన్ డీసీపీ రక్షిత మూర్తి అన్నారు. ఈ మేరకు ఆదివారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధి బోడుప్పల్ నగరపాలక పరిధి అంజయ్య ఎన్క్లేవ్, ఏఆర్ఆర్ కాలనీలో సీసీ కెమెరాల దాతలు కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ, కొత్త కిశోర్గౌడ్ సహకారంతో దాదాపు రూ. 2. 80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 15 కమ్యూనిటీ సీసీ కెమెరాలను డీసీపీ, ఏసీపీ శ్యామ్ప్రసాద్, స్థానిక డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్ చందర్గౌడ్, సీఐ అంజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చందర్గౌడ్, బొమ్మక్ కల్యాణ్, నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.