బోడుప్పల్, ఆగస్టు: చెంగిచర్ల బస్ డిపో నుంచి పటాన్చెరువు వరకు ఉదయం 8గంటల నుంచి బస్సులను ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎన్ ఈసు ఓ ప్రకటనలో తెలిపారు. చెంగిచర్ల, బోడుప్పల్, చిలుకానగర్ ప్రజలు బాలానగర్, కూకట్పల్లి, పటాన్చెరువు వరకు సులువుగా ప్రయాణం చేయడానికి వీలుగా24ఈ 219 రూట్ బస్సును ప్రవేశపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
చిలుకానగర్, నాచారం, హౌజింగ్ బోర్డు కాలనీ, ఈసీఐఎల్, నేరడ్మెట్, తిరుమలగిరి, బోయిన్పల్లి మీదుగా పటాన్చెరువు బస్సులు చేరుకుంటాయని పేర్కొన్నారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.