శామీర్పేట : శామీర్పేట మండలం అలియాబాద్ రైతు వేదికలో సైబరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సీఐ సుధీర్కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది సరైన సమయానికి రక్తం అందక మృత్యువాత పడుతున్నారని, తలసేమియా, డెంగీ, కరోనా మహమ్మరి వంటి వ్యాధులకు రక్తం ఎంతో అవసరంగా మారిందన్నారు.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదాతలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు వీరశేఖర్, రవికుమార్, గణేష్, రాంచందర్, పోలీస్ సిబ్బంది, డియర్ వన్ నియర్ వన్ ఫౌండేషన్ సభ్యులు గోపాల్రెడ్డి, చంద్రశేఖర్, భానుచందర్, సందీప్రెడ్డి, సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.