వినాయక్నగర్ : రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని డీసీపీ పద్మజ అన్నారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో పీవీఆర్ గార్డెన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజ మాట్లాడుతూ కరోనా వ్యాధితో బాధపడుతున్న వారితో పాటు ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలను రక్షించడానికి రక్తం ఉపయోగపడుతుందని అన్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడానికి యువతలో ప్రేరణ కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రామలింగరాజు, సీఐ గంగాధర్, డీఐ కిరణ్, ఎస్సైలు నవీణ్, మాజిద్అలీ, గోపి, నాయకులు సురేందర్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.