పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేడిపల్లిలోని శ్రీ శ్రీశ్రీ సీతారామచంద్ర స్వామి( శ్రీ శివ రామ క్షేత్రం)దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం వేద పండితులచే ఆలయం పుననిర్మాణ పనులకు భూమిపూజా మహోత్సవ కార్యక్రమం మేయర్ జక్క వెంకట్రెడ్డి, రామాలయ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సం భారత ధర్మదేవత, శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీశ్రీ శివస్వామి చేతుల మీదుగ నూతనంగా నిర్మించే ఆలయ భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతిహోమం, యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు.
మొదట మేడిపల్లిలోని బోడ్రాయి వద్ద పూజలు నిర్వహించి నగర వీధుల్లోని నుంచి పలు ఆలయాలను దర్శించుకుంటూ రామలయం వరకు జై శ్రీ రామ నినాదాలతో శైవక్షేత్ర పీఠాదిపతులు, మేయర్, డిప్యూటి మేయర్, రామాలయ ట్రస్ట్ సభ్యులు పట్టణ పెద్దలు వివిధ పార్టీల నాయకులు, భక్తులు వైభవంగా మహా శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి.ఎస్ ప్రభాకర్. నాయకులు విక్రమంరెడ్డి, రామాలయ ట్రస్ట్ చైర్మన్ బాలరాజు, కార్పొరేటర్లు హరిశంకరెడ్డి, సుభాష్, శశిరేఖ బుచ్చియాదవ్, అనంతరెడ్డి, యుగేందర్రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.