చర్లపల్లి, జూన్ 1: టీకా పంపిణీ ప్రక్రియను ప్రభు త్వం వేగవంతంగా కొనసాగిస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే, కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష, పన్నాల దేవేందర్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికీ వ్యాక్సి న్ వేసేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించి కరోనా వైరస్ కట్టడిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. నియోజకవర్గం పరిధిలో కరోనా వైరస్ను అరికట్టేందుకు రసాయనాల పిచికారీ పనులు ముమ్మరం చేయడంతో పాటు పారిశుధ్య పనులు మరింత వేగవంతం చేయాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వం విధించిన నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ మైత్రేయి, ప్రాజెక్ట్ అధికారిణి ఇందిర, ఎస్సై శ్రీనివాస్, నాయకులు డప్పు గిరిబాబు, నాగిళ్ల బాల్రెడ్డి, జాండ్ల ప్రభాకర్రెడ్డి, సోమశేఖర్రెడ్డి, కర్రె సత్యనారాయణ, గగన్కుమార్, గరిక సుధాకర్, రెడ్డినాయక్, వెంకటేశ్, చంద్రమౌళి, బొజ్జ రాఘవరెడ్డి, బత్తుల శ్రీకాంత్యాదవ్, సీసీఎస్ ప్రతినిధి పద్మారెడ్డి, లక్ష్మినారాయణ, పెద్ది నాగరాజు, రహీం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్: రోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మెరుగైన వైద్యాన్ని అందించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆయన మల్లాపూర్ డివిజన్ సూర్యనగర్లోని ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్యశాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పక్రియ, కొవిడ్ నిర్ధారణ పరీక్షలపై ఆరా తీశారు. డాక్టర్లకు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పూజ, వైద్య సిబ్బంది రాకేశ్, ఏఎన్ఎంలు, టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, సోమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్: సూపర్ స్ప్రెడర్లకు ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నదని, సద్వినియోగం చేసుకోవాలని నాచారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ అన్నారు. నాచారంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కిరణాషాపులు, కూరగాయలు, చికెన్, మటన్, వైన్, పండ్ల వ్యాపారులను కలిసి టీకాపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్, యాదగిరి, కిట్టు, మూర్తి, జవాన్ కృష్ణ, ఎస్ఎఫ్ఏ అశ్విన్, తదితరులు పాల్గొన్నారు.