ఉప్పల్, ఏప్రిల్ 8 : ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాచారం, హబ్సిగూడ డివిజన్లకు చెందిన బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను గురువారం అందజేశారు. ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నాచారానికి చెందిన రామకృష్ణకు రూ.60 వేలు, భాగ్యమ్మకు రూ.60 వేలు, సయ్యద్ ఇస్మాయిల్కు రూ.60 వేలు, నర్సింహచారికి రూ.38 వేలు, హబ్సిగూడకు చెందిన విజయలక్ష్మికి రూ.26 వేల చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అనారోగ్యం, ఇతర వైద్యసేవల కోసం తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. వైద్య ఖర్చులు భారం కాకుండ సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా చెక్కులు అందజేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్, అరిటికాయల భాస్కర్ ముదిరాజ్, గరిక సుధాకర్, వనంపల్లి గోపాల్రెడ్డి, కొంగల శ్రీధర్, నందికంటి శివ, కృష్ణారెడ్డి, కట్ట బుచ్చన్నగౌడ్, సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.