ఖమ్మం, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. సోమవారం నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో అధికారులు ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మొత్తం 60 డివిజన్లకుగాను అందులో 10వ డివిజన్ను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకోగా 59 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో 42 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకున్నది. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని సీపీఐ 2 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఒకేఒక్క డివిజన్కు పరిమితం కాగా, కాంగ్రెస్ 10 స్థానాలు దక్కించుకొన్నది. 60 డివిజన్లకు 45 (టీఆర్ఎస్ 43+సీపీఐ2) స్థానాలు కైవసం చేసుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకొన్నది. ఫలితాలపై ముందే ఒక అంచనాతో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేసిన అభ్యర్థుల మినహా కౌంటింగ్ కేంద్రానికి సీనియర్ నేతలెవరూ రాలేదు.