ఉప్పల్ :వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఉప్పల్ ఆర్టీఓ పుల్లెంల రవీందర్కుమార్ అన్నారు. సెప్టెంబర్ 1 తేదీ నుంచి పాఠశాలల ప్రారంభమవుతున్న నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ వాహనాల యజమానులతో ఆర్టీఓ పుల్లెంల రవీందర్కుమార్ ఉప్పల్ ఆర్టీఓ కార్యాలయంలో శనివారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రవేట్ వాహనాల ఫిట్నెస్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించిందని తెలిపారు.
గడువులోగా వాహనాల ఫిట్నెస్ను పరీక్షించుకోవాలని ఆయన సూచించారు. స్కూల్స్ ప్రారంభమైన తర్వాత వాహనాల ఫిట్నెస్ ను తనిఖీ చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్స్ ప్రవీందర్రాజు, కొండయ్య, చంద్రశేఖర్, ఏఎంవీఐ అనిత, ఏఓలు సునీత, ప్రసాద్, వాహనాల యజమానులు పాల్గొన్నారు.