కుత్బుల్లాపూర్, ఆగస్టు 29: భారత స్వాతంత్య్రానికి 75 యేళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ‘అవని నృత్యాలయం’ సంస్థ, పలువురు కళాకారులు ‘75 నిమిషాల వ్యవధిలో..75 మంది కళాకారులు పాల్గొని 75 పాటలు’కు ఏక కాలంలో నిర్విరామంగా నృత్యం చేసి వర ల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. కొంపల్లిలోని ఏఎమ్మార్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ఈ ఈవెంట్లో కళాకారులు జూంబా నృత్యాలతో రికార్డును నెలకొల్పారు. అవని నృత్యాలయం కొరియోగ్రాఫర్ డాక్టర్ నామని రవి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్లో ఫౌం డర్ ఐఎస్ కె.విజేంద్ర, ఎ.ధనలక్ష్మి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ సలహాదారులు వేణుగోపాలచారి, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, ఎస్ఆర్ డిజి స్కూల్ కె.రాధికారెడ్డి, డా॥ కుప్పా శ్రీకాంత్ గౌడ్, నటుడు, యాంకర్ అడ్ల సత్తీష్ కుమార్, పలు రికార్డు సంస్థల నిపుణుల సమక్షంలో ఈవెంట్ను చేపట్టారు. 17 ఏళ్లలోపు చిన్నారులు అంతా ప్రదర్శించిన ఈ నృత్య వే డుకలు ఒక వేడుకగా సాగాయి. చిన్నారి కళాకారులు ప్రదర్శనించిన ఈ నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు అధ్యక్షులు డా॥ చింతపట్ల వెంకటాచా రి, బన్సీరాజు, ప్రపంచ రికార్డుల తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి ఉదయ భాస్కర్, సంజీవరెడ్డి, మధు కళ్లె, నాగభరణి ధారావాహిక ఫేమ్ మాస్టర్ బుజ్జి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.