దుండిగల్, ఆగస్టు : తెలంగాణరాష్ట్రాన్ని హరితవనంగా మర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతగా నిర్వహిస్తున్నందుకు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్లో టీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ “మొక్కలు పెంచడంతో రాష్ట్రం ఆకుపచ్చవనంగా మారడంతో పాటు వర్షాలు అధికంగా కురుస్తాయన్నారు.
ఫలితంగా పంటలు సమృద్ధిగా పండి రైతులు సంతోషంగా ఉంటారన్నారు. పచ్చదనం వల్ల నగరాలు, పట్టణ ప్రాంతాలల్లో వాయుకాలుష్యం తగ్గుతుందని అన్నారు. ఇంతటి మహోన్నత లక్ష్యాలను సాధించాలనే ఉదేశ్యంతోనే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉద్యమంలా అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కో-అప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.