జవహర్నగర్, ఆగస్టు 22 : స్వరాష్ట్రంలో అంగన్వాడీల కలలు సాకారమవుతున్నాయి. అండగా నిలిచిన ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలో మూడుసార్లు జీతాలు పెంచింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు టీచర్లకు రూ. 4,200 వేతనం ఉండగా ప్రస్తుత వేతనం రూ. 13,650 కి పెంచారు. అలాగే ఆయాలకు 2,200 వేతనం ఉండగా… తాజాగా రూ. 7,800లకు పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెరిగిన వేతనాలతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కొత్త ఉత్సాహంతో విధులు నిర్వర్తిస్తున్నారు.
అంగన్వాడీ టీచర్లను ఉమ్మడి పాలనలో పట్టించుకోలేదు. వెట్టి చాకిరీ చేయించుకున్నారే తప్పా మా బతుకుల గురిచి పట్టించుకోలేదు. ఇప్పటి వరకు చిన్న జీతాలతో ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ మూడు సార్లు వేతనాలు పెంచారు. అంగన్వాడీ టీచర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించడం హర్షణీయం. మా సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. -జయ, అంగన్వాడీ టీచర్, అంబేద్కర్నగర్
ప్రభుత్వం అంగన్వాడీల పనిని గుర్తించి తగిన వేతనం అందించడం సంతోషంగా ఉంది.2200 వేతనం ఉండగా… తాజాగా రూ. 7,800లకు సీఎం కేసీఆర్ సారు పెంచారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్నాం. సీఎం కేసీఆర్ మా సేవలను గుర్తించి వేతన సవరణ అమలు చేయడంపై సంతోషంగా ఉంది. -నాగమణి, అంగన్వాడీ ఆయా